కరుణానిధి మరణం తీరని లోటు

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకొన్నారు. ఆయన మరణం తీరని లోటని కన్నీటిపర్యంతం అవుతున్నారు.

* రజనీకాంత్‌: ‘ఇది బ్లాక్‌ డే. ఈ రోజును నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’

* రాధిక : ‘ఇది మాకు చీకటి రోజు. నా మనసు మొత్తం ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలతో నిండిపోయింది. తమిళుల కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి. ఆయన సంకల్పం ఎప్పుడూ జీవంతోనే ఉంటుంది. ఆయన్ను మిస్‌ అయ్యాం. ఓ గొప్ప నాయకుడు మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఆయనకు కన్నీటి వీడ్కోలు’.

* హన్సిక : ‘దేశంలోనే ఓ గొప్ప నాయకుడు కరుణానిధి గారు కన్నుమూశారు. ఈ లోటును జీర్ణించుకునే ధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మొత్తం తమిళులకు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా’.

* ఖుష్బూ : ‘నెల క్రితం నేను ఆయనతో కలిసి దిగిన ఫొటో ఇది. గొప్ప నాయకుడైన ఆయన్ను కలవడం అదే చివరిసారి అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. మేం మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం అప్పా’.

* మోహన్‌బాబు : ‘నిజమైన లెజెండ్‌. కరుణానిధి మరణం తీరని లోటు. సోదరులు స్టాలిన్, అలగిరి, మొత్తం కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా. ఆయన తన పథకాలతో లక్షల మంది జీవితాల్ని ప్రభావితం చేశారు. లక్షల మందికి జీవితంపై ఆశ పుట్టించారు. తన రచనతో ‌లక్షల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు’.

* రమ్యకృష్ణ : ‘ఈ భూమి మీద నుంచి నింగికేగిన వారంతా నిజంగా మనల్ని వదిలి వెళ్లినట్లు కాదు.. వాళ్లు మన హృదయాల్లో, ఆలోచనల్లో ఎప్పుడూ అలానే జీవిస్తుంటారు. కరుణానిధి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’.

* విశాల్‌ : ‘గొప్ప నాయకుడు కరుణానిధి అయ్య ఇకలేరన్న విషయం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. ఆయన మరణం తీరని లోటు. ఆయన సినీ రంగానికి, రాజకీయ రంగానికి ఎనలేని సేవ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా సానుభూతి తెలుపుతున్నా’.

* విష్ణు : ‘కరుణానిధి కుటుంబ సభ్యులకు, తమిళ సోదరసోదరీమణులకు ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆయన మరణం తీరని లోటు’. * మాధవన్‌: ‘డైనమిక్‌ నాయకుడు, రచయిత‌‌ కరుణానిధి కన్నుమూయడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఆయన పార్టీ సభ్యులు, కుటుంబ సభ్యులు, సహాయకులకు నా సానుభూతి తెలుపుతున్నా’.

* ప్రసన్న : ‘ద్రవిడ ఉద్యమ మూల స్తంభం. డీఎంకే అధినేతగా 50 ఏళ్లు కొనసాగిన వ్యక్తి కరుణానిధి కన్నుమూత తీరని లోటు. కరుణానిధి ఆత్మకు శాంతి చేకూరాలి’.

* రితేష్‌ దేశ్‌ముఖ్‌ : ‘ఇవాళ భారతదేశం ఓ గొప్ప నాయకుడ్ని కోల్పోయింది. కరుణానిధి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా సానుభూతి తెలుపుతున్నా. ఆయన తమిళనాడు రాష్ట్రానికి, ప్రజలకు చేసిన సేవ అపారమైనది’