పోలీస్ కేసులో ఇరుక్కున్న ధృవ్


కోలీవుడ్ స్టార్ విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా ఇంట్రీ ఇస్తున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ రిమేక్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ఐతే, సినిమా విడుదల కాకముందే ధృవ్ ఇప్పుడు ఓ యాక్సిడెంట్ కేసుతో వార్తల్లోకెక్కాడు. ఈరోజు ఉదయం ధృవ్ పెద్ద యాక్సిడెంట్ చేశాడు. ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టాడు. ఆటో డ్రైవర్ కాలు విరిగింది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారమ్.

వివరాల్లోకి వెఌతే.. ఈరోజు తెల్లవారుజామున చెన్నైలోని పాండీ బజార్ వెనక రోడ్డు నుంచి వేగంగా వెళ్తున్న ధృవ్ కారు పక్కనే ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఆ వెంటనే అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న గుంతలో దిగబడింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ కాలు విరిగింది. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంతకి తెల్లవారుజామునే ధృవ్ వేగంగా కారు నడపాల్సిన అవసరం ఏమొచ్చింది ? అంటే కొందరు లేట్ నైట్ పార్టీకి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్నాడని చెబుతున్నారు. మరికొందరు మాత్రం పొద్దున్నే షూటింగ్ కు వెళ్లేందుకు ధృవ్ బయల్దేరాడని చెబుతున్నారు. ఈ విషయంలో పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.