షాకింగ్ : సెట్స్ మీద ఉండగానే మహేష్, తారక్.. సినిమాలు మొత్తం లీకు

టాలీవుడ్ ని షేక్ చేసే బ్రేకింగ్ న్యూస్ ఇది. ప్రస్తుతం సెట్స్ మీదున్న మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’, విజయ్ దేవరకొండ ‘అరవింద సమేత’.. సినిమాలన్నీ పైరసీ అయ్యాయి. తాజాగా, హైదరాబాద్ పోలీసులు రాజేష్ అనే సినిమా ఎడిటర్‌ని అరెస్ట్ చేశారు. ఆయన్నుంచి ఓ హార్డ్ డిస్క్ ని స్వాధీనం చేసుకొన్నారు. ఈ హార్డ్ డిస్క్‌‌లో ప్రస్తుతం సెట్స్ మీదున్న టాలీవుడ్ క్రేజ్ సినిమాల పుటేజ్ ఉండటంతో పోలీసులు కంగుతిన్నారు.

మహర్షి, అరవింద సమేత సినిమాలతో పాటు గీత గోవిందం, టాక్సీవాల సినిమాలకు సంబంధించిన రా ఫుటేజ్‌ కూడా ఈ హార్డ్ డిస్క్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీని వెనక పట్టుబడ్డ ఎడిటర్ రాజేష్ తోపాటు, గుంటూరుకు జిల్లాకు చెందిన 17 మంది విద్యార్థులకు ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. వీరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.