మళ్లీ.. రామ్ చరణ్ ఎవడు ? అంటున్న దర్శకుడు !

స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసే దర్శకుడు వంశీపైడిపల్లి. ఆయన్నుంచి యేడాదికో, రెండేళ్లకే ఓ సినిమా వస్తుంటుంది. ‘ఊపిరి’ తర్వాత మరో సినిమా చేసేందుకు రెండేళ్ల సమయం తీసుకొన్నాడు వంశీ. ప్రస్తుతం మహేష్’ని ‘మహర్షి’గా తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉన్నాడు. ఇందులో మహేష్ ని మూడు డిఫరెంట్ షేడ్స్ లో చూపించబోతున్నాడని చెబుతున్నారు. వచ్చే యేడాది ఏప్రిల్ 5న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తర్వాత వంశీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకొంటున్నట్టు సమాచారమ్. గతంలో రామ్ చరణ్ తో ‘ఎవడు ?’ తీశాడు వంశీ. ‘ఒకే మనిషి.. రెండు రూపాలు’ కాన్సెప్ట్ గా తెరకెక్కిన ‘ఎవడు ?’ ప్రేక్షకులని థ్రిల్ చేసింది. చరణ్-బన్నీ కలిసి నటించడం.. అది కూడా ఒకే పాత్రలో కావడం ఆకట్టుకొంది.

ఇప్పుడు మరోసారి ‘ఎవడు’ కాంబో రిపీట్ కానుందని చెబుతున్నారు. మహేష్ ‘మహర్షి’ తర్వాత వంశీ రామ్ చరణ్ తో జతకట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఎలాగూ.. స్క్రిప్ట్ పూర్తి చేసేందుకు వంశీ యేడాదికిపైగా టైం తీసుకొంటాడు. ఈలోపు రామ్ చరణ్ రాజమౌళి మల్టీస్టారర్ ని కూడా పూర్తి చేయనున్నాడు. ఈ కాంబోపై క్లారిటీ రావాలంటే మరో ఆరు నెలలైనా వెయిట్ చేయాలేమో.. !