గాయాన్ని ఎంజాయ్ చేస్తోంది !

హీరోయిన్ అమలాపాల్ కు జీవితంలో పెద్ద గాయమే అయ్యింది. ఆమె భర్త విజయ్ నుంచి విడిపోయింది. అలాగని ఆమె ఏమీ కుంగిపోలేదు. బయట ప్రచారం జరిగినట్టు ఆమె కెరీర్ ఏమీ ముగిసిపోలేదు. అంతకు రెట్టింపుగా రాణిస్తోంది. కోలీవుడ్, టాలీవుడ్ రాణించిన.. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లోనూ అడుగుపెట్టబోతుంది.

తాజాగా, అమలా షూటింగ్ లో గాయపడింది. ‘అదో అంద పరవాయ్ పోల’ సినిమా షూటింగ్ లో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశంలో నటిస్తుండగా ఆమె గాయపడింది. మణికట్టు ట్విస్ట్ అయింది. గాయపడిన సమయంలో చిన్న గాయమేనని భావించి షూటింగ్ కొనసాగించింది అమలాపాల్. ఐతే, నొప్పి తీవ్రతరం కావడంతో చిత్ర బృందం ఆమెను ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం ఆమె కేరళలో చికిత్స పొందుతొంది. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

మనసుకైనా గాయంతో పోలిస్తే.. చేతికైనా గాయం ఎంత అనుకుందేమో.. చేతికి కట్టు కట్టుకుని ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది. ఇప్పుడీ పిక్ వైరల్ గా మారింది. అమలాకు గాయం న్యూస్ విని కంగారు పడిన ఆమె అభిమానులు సైతం.. ఈ పిక్ ని చూసి చిల్ అంటున్నారు.

ఇదిలావుండగా.. అమలాపాల్ బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. న‌రేశ్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వంలో అర్జున్ రాంపాల్ ద‌ర్శ‌క‌త్వంలో అమ‌లా పాల్ న‌టించ‌నుంది. హిమాల‌యాల్లో తెర‌కెక్క‌బోయే ఈ సినిమా అక్టోబ‌ర్‌లో ప్రారంభం కానుంది.