మెహ్రీన్’తో సుధీర్ రొమాన్స్


వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ కొడుతున్నారు యంగ్ హీరోలు. ఈ లిస్టులో సుధీర్ బాబు ఉన్నాడు. ఆయన విభిన్నమైన కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇటీవల ‘సమ్మోహనం’ సినిమాతో హిట్‌ అందుకున్న ఆయన ప్రస్తుతం ‘నన్ను దోచుకుందువటే’లో నటిస్తున్నారు. ఆర్‌.ఎస్‌.నాయుడు దర్శకుడు. నభా నతీష్‌ హీరోయిన్. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న తొలి చిత్రమిది.

ఈ సినిమా తర్వాత సుధీర్ బాబు పులి వాసు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో సుధీర్ బాబు సరసన మెహరీన్ జతకట్టనుంది. రేపు ఉదయం 9.30 గంటలకు రామానాయుడు స్టూడియోస్‌లో సినిమా షూటింగ్‌ ప్రారంభం జరుపుకోణుంది. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.