వాజ్ పెయ్ పై గ‌వ‌ర్న‌ర్ రాంగ్ ట్వీట్..!

మాజీ ప్ర‌ధాని వాజ్ పెయి ఆరోగ్యం మ‌రింత క్షీణించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న చ‌నిపోయారంటూ త్రిపుర గ‌వ‌ర్న‌ర్ త‌థాగ‌త రాయ్ ట్వీట్ చేశారు. ఓ వైపు ఆయ‌నకు ఇంకా చికిత్స కొన‌సాగుతోంద‌ని, ఆయన క్రిటికల్ గా ఉన్నారని ఎయిమ్స్ నుంచి వార్తలు వస్తున్ప‌ప్ప‌టికీ ఉన్నత స్థానంలో ఉన్న ఒక గవర్నర్ నుంచి వాజ్ పేయి మరణ వార్త ట్వీట్ రావడం తో అది వైరలైపోయింది. ఆయన మీద విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయ‌న వెంటనే స్పందించి ట్వీట్ ను తొల‌గించారు.

ఆ త‌రువాత ‘‘క్షమించండి. ఒక జాతీయ టీవీ చానెల్‌లో వచ్చిన వార్తలను చూసి నేను అలా ట్వీట్ చేశాను. దానికిముందుకు ఈ వార్త నిజమా కాదా అనేది విచారించి ఉండాల్సింది. మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం మీద ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నా ట్వీట్‌ను తొలగించేశాను. క్షమించాలని మరొకసారి నెటిజన్లను కోరుతున్నాను..’’ అంటూ త‌న త‌ప్పుపై విచారం వ్య‌క్తం చేశారు.