పరశురామ్ లక్ష్యం పెద్దదిగా పెట్టుకో.. !

దర్శకుడు పరశురామ్ తీసుకొన్న నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో ప్రతిభ గల దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకొన్నాడు పరశురామ్. ‘గీత గోవిందం’ సినిమాతో మరో మెట్టెక్కారాయన. స్వాత్రంత్య్ర దినోత్సవం కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గీత గోవిందం’ హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి గీత గోవిందంపై ప్రశంసలు కురిపించారు. పరశురామ్ ని అభినందించారు.

ఇలాంటి ప్రతిభ గల దర్శకుడు.. గీత గోవిందం తర్వాత చేయబోయే సినిమా ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఓ స్టార్ హీరోని ఒప్పించే ప్రయత్నం చేయాలి. పరశురామ్ సరైన కథతో వెఌతే.. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కాదనడు. ఎందుకంటే ? పరశురామ్ ప్రతిభ గురించి బన్నీకి తెలుసు. ‘శ్రీరస్తు శుభమస్తు’తో అల్లు శిరీష్ కు హిట్ ఇచ్చిన పరశురామ్ అంటే అరవిందకు భలే ఇష్టం. ఇదీగాక, పరశురామ్ తన ప్రతికథని బన్నీకి వినిపిస్తుంటాడు. గీత గోవిందం కథ తొలిసారి వినిపించింది బన్నీకే. అలాంటి చనువు ఉన్న పరశురామ్ మెగా స్టార్ హీరోలతో ఎందుకు సినిమా చేయకూడదు ?

అది కూడా ‘గీత గోవిందం’లాంటి సినిమా తర్వాత తన తదుపరి సినిమాని పరశురామ్ మంచు విష్ణుతో ఓకే చేసుకోవడం ఆశ్చార్యాన్ని కలిగిస్తోంది. అలాగని విష్ణు తక్కువని కాదు. అవును.. పరశురామ్ తదుపరి సినిమా మంచు విష్ణుతో ఓకే అయ్యింది. పరశురామ్ కు స్టార్ హీరోలతో సినిమా చేసే టాలెంట్ ఉండి కూడా అల్లు శిరీష్, మంచు విష్ణు లాంటి మీడియం రేంజ్ హీరోలని పట్టుకొని ఊగులాడటం ఆయన అభిమానులకు నచ్చడం లేదని టాక్. పోనీలే.. పరశురామ్ కారణంగా శిరీష్, విష్ణులాంటోళ్లకైనా ఓ హిట్ దక్కుతుంది.