అల్లుడి వేడుక క్యాన్సిల్


‘శైలాజా రెడ్డి అల్లుడు’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాగ చైతన్య. ఆయన అత్త శైలాజా రెడ్డిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుంది. అత్త కూతురు, చైతూ మరదలుగా అనుఇమ్మాన్యూయేల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఈ నెల 31న ‘శైలాజా రెడ్డి అల్లుడు’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఐతే, అంతకంటే ముందు ఈ ఆదివారం ఈ సినిమా ఆడియో వేడుకని ఘనంగా నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఇప్పుడీ వేడుక క్యాన్సిల్ అయినట్టు సమాచారమ్. ఆడియో వేడుకని రద్దుచేసి.. ఆడియో ఆల్భమ్ ని నేరుగా నెట్ లో విడుదల చేయనున్నారు. ఇక, సినిమా విడుదలకు ఒకట్రెండు రోజుల ముందు ప్రీ-రిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించేందులు ప్లాన్ చేసినట్టు తెలిసింది.

ఇంతకీ అల్లుడి వేడుక వాయిదా పడటానికి అసలు కారణలేంటీ ? అనేది తెయడం లేదు. దర్శకుడు మారుతి కేరళ వరదల్లో చిక్కికుపోయాడు. ఆయన హైదరాబాద్ చేరుకోవడానికి మరో ఒకట్రెండు రోజులు సమయం పట్టవచ్చని చెబుతున్నారు. కొందరి మాత్రం అసలు కారణం ఇది కాదని చెబుతున్నారు. కారణం ఏదేమైనా.. అల్లుడి ఆడియో వేడుక మాత్రం వాయిదా పడిందని తెలుస్తోంది.