వెంకీ-సూర్య మల్టీస్టారర్.. మరో అప్ డేట్ !

విక్టరీ వెంకటేష్, తమిళ్ స్టార్ సూర్య మల్టీస్టారర్ రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నట్టు చెబుతున్నారు. ఇప్పుడీ మల్టీస్టారర్ గురించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ మల్టీస్టారర్ కు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించనున్నారు.

త్రినాథరావు సినిమాలు మాస్ టచ్ లో వినోదాత్మకంగా ఉంటాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా చూపిస్తామా, నేను లోకల్ సినిమాలు మాస్, యూత్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకొన్నాయి. ప్రస్తుతం రామ్ హీరోగా ‘హలోగురూ ప్రేమ కోసమే’ సినిమా చేస్తున్నారు. ‘ఎంగేజ్ మెంట్ జరిగిన అమ్మాయిని ప్రేమించే యువకుడి కథ’తో తెరకెక్కుతోన్న చిత్రమిదని చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత వెంకీ-సూర్యల మల్టీస్టారర్ ని మొదలెట్టనున్నారు.