‘కంటి వెలుగు’లో అప‌శృతి…!

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కంటి వెలుగు ప‌థ‌కానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో మాత్రం కంటి వెలుగు ప‌థ‌కంలో అప‌శృతి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కంటి వెలుగు ఆపరేషన్ ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. షాద్ నగర్ నియోజకవర్గం, దత్తాయపల్లికి చెందిన చెన్నమ్మ కంటి ఆపరేషన్ వికటించడంతో మరణించింది. శుక్రవారం కంటి ఆపరేషన్ కోసం కొత్తూరు సమీపంలోని హాస్పిటల్ కి వెళ్ళిన చెన్నమ్మకు కంటి ఆపరేషన్ కోసం మత్తు మందు ఇచ్చారు. మత్తు మందు డోసు ఎక్కువ కావడంతో కోమాలోకి వెళ్లిన చెన్నమ్మ మృతి చెందింది. ఆమె చావుకి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అంటూ మృతురాలి కుటుంబీకులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేప‌ట్టారు.