నెల‌జీతం సాయం చేసిన టీఆర్ఎస్ మంత్రులు.

కేర‌ళ వ‌ర‌ద‌బాధితుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 25కోట్ల తక్ష‌ణ సాయాన్ని అందించింది. కేర‌ళ క‌ష్టాన్ని చూసి చ‌లించిపోయిన నేత‌లు ప్ర‌భుత్వ సాయంతో పాటు వ్య‌క్తిగ‌తంగా త‌మ‌వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు. మంత్రులు కేటీఆర్, హ‌రీష్ రావు, మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే వివేకానంద , ఇరిగేష‌న్ ఇంజ‌నీర్లు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్టున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మొత్తాన్ని కేర‌ళ రిలీఫ్ ఫండ్ కు అందిస్తామ‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధులంతా త‌మ‌వంతుగా త‌మ‌కు తోచినంత సాయం చేయాల‌ని మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర లో పిలుపునిచ్చారు.