భ‌ర్త‌ను మార్చ‌డంపై టీ-స‌ర్కారును నిల‌దీసిన భార్య‌..!

భార్య ఒక్క‌రే.. భ‌ర్త‌లు ఇద్ద‌రు అంటూ తెలంగాణ స‌ర్కారు నిర్వాకంపై సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో వైర‌ల్ అయిన ఆ యాడ్ గుర్తుందా… అన్ని పేప‌ర్ల‌లో మెయిన్ లో మొద‌టి పేజీ యాడ్ గా వ‌చ్చిన యాడ్..అప్ప‌ట్లో రైతు భీమాకు, ఇప్పుడు కంటి వెలుగుకు ఒకే ఫ్యామిలీతో యాడ్ వేసిన తెలంగాణ ప్ర‌భుత్వం కేవ‌లం ఆ ఫోటోలోని భ‌ర్త ను మాత్రం మార్చింది. దీంతో ప్ర‌భుత్వ నిర్వాకంపై విప‌క్షాల‌తో పాటు, సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో వైర‌ల్ అయింది ఈ యాడ్.

అయితే ఎవ‌రో జూనియ‌ర్ ఆర్టిస్టులు యాడ్ ఇచ్చి ఉంటారులే అనుకుని కొంత‌మంది లైట్ తీసుకున్నారు కూడా. అంతేకాదు టీఆర్ఎస్ నేత‌లు ఇదే విష‌యాన్ని నొక్కి చెప్పారు. యాడ్స్ లో నటించే వాళ్లు ఎవరితోనైనా నటిస్తారని చెప్పుకొచ్చారు కూడా. కానీ వాస్త‌వానికి వారు జూనియ‌ర్ ఆర్టిస్టులు కాద‌ట‌. తాజాగా ఆ ఫోటోలోని మ‌హిళ స్పందిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

లోన్లు ఇస్తామని కొందరు అధికారులు మాయమాటలు చెప్పి ఫొటోలు తీసుకుపోయి తమను నవ్వులపాలు చేశారని ఆ కుటుంబం బాధ‌ప‌డుతోంది. తన ఫొటో పక్కన తన భర్త ఫొటో కాకుండా వేరే వ్యక్తి ఫొటో పెట్టి తమను అవమానాలపాలు చేశారని, గుంట‌ భూమి లేని త‌మ‌కు రైతు బీమా ఎట్లొస్తదని సర్కారును నిల‌దీస్తోంది ఆ మ‌హిళ‌. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల‌కు, టీస‌ర్కారు అధికారుల‌కు దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది.

వేరే వ్యక్తి ఫొటో పెట్టి పేపర్లలో యాడ్ వేయడంతో తమ కుటుంబం బజారుపాలైందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పాపకు స్నానం చేయిస్తుంటే తన ఫొటో, తన పాప, తన భర్త ఫొటోలు తీసుకుపోయి ఇలా మార్చి ప‌చ్చ‌ని సంసారంలో నిప్పులు పోస్తారా అంటూ ఆ మ‌హిళ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. మ‌రి ప్ర‌భుత్వం వీరికి ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాలి.