భ‌ర్త‌ను మార్చిన‌ యాడ్ ఏజెన్సీల‌కు నోటీసులు..!

భ‌ర్త‌ల్ని మార్చిన అంశంలో యాడ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. రైతుబంధు, కంటివెలుగు ప‌థ‌కాల‌పై ప్ర‌క‌ట‌న‌ల‌పై జారీ చేసిన రెండు యాడ్స్ లో త‌న భ‌ర్త‌ను మార్చి కుటుంబంలో చిచ్చు పెట్టారంటూ మ‌హిళ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో అధికార యంత్రాంగంలో క‌ద‌లిక వ‌చ్చింది. ఈ విష‌యంపై రెండు యాడ్ ఏజెన్సీల‌కు నోటీసులు జారీ చేసినట్టు సమాచార, పౌర సంబంధాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకే మహిళ, భర్తలు వేర్వేరుగా వుండటంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వ‌చ్చిన నేపథ్యంలో ప్రకటనల్లో వున్న మహిళ ఫోటో వివరాలు తెలపాలని, ఆ మహిళ నుంచి ఆమె ఫోటో ప్రచురణకు తీసుకున్న అనుమతి పొందిన వివరాలను సోమవారం మధ్యహ్నంలోగా తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. పూర్తి నివేదిక అందిన తర్వాత ఏజెన్సీలపై తగు చర్యలు తీసుకోనున్నారు.