గీత గోవిందం బ్లాక్ బస్టర్.. బన్నీ ముందే చెప్పేశాడా.. !

‘గీత గోవిందం’ హవా దేశ, విదేశాల్లోనూ కొనసాగుతోంది. ఆస్ట్రేలియాలో బాలీవుడ్ సినిమాలని మించి కల్లెక్షన్స్ రాబడుతోంది. దీంతో చిత్రబృందం ఆనందంలో ఉంది. ఐతే, ఈ విజయాన్ని స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ముందే ఊహించాడట. అసలు ఈ కథని తొలిసారి విన్నది బన్నీయే. తాను ఏ కథ రెడీ చేసుకొన్న మొదట బన్నీకి వినిపించడం దర్శకుడు పరశురామ్ కు అలవాటు. గీత గోవిందం కథని మొదట బన్నీకే వినిపించాడు పరశురామ్. ‘కథ విన్నాక.. చాలా బాగుంది. సినిమా చేయు’ అని చెప్పాడట.

సినిమా రెడీ అయ్యాక మొదట చూసింది బన్నీయే. ఆ విషయాన్ని గీత గోవిందం ఆడియో వేడుకలో చెప్పాడు కూడా. సినిమా అదిరిపోయింది. విజయ్, రష్మిక పోటీపడి మరీ నటించారని చెప్పారు. సినిమా విడుదలయ్యాక అందరు అదే చెబుతున్నారు. మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి.. తదితరులు గీత గోవిందంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ గీత గోవిందం చిత్ర‌బృందాన్ని అభినందించారు. ఈ సినిమా గురించి బన్నీ మొదటి నుంచి చెబుతున్నారు. ఇప్పుడది నిజమైంది అన్నారు హరీష్.