ఏఐసీసీలో రాహుల్ కీల‌క మార్పులు

ఏఐసీసీలో రాహుల్ గాంధీ కీల‌క మార్పులు చేశారు. ప్ర‌స్తుతం ఏఐసీసీ కోశాధికారిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మోతిలాల్ వోరా స్థానంలో అహ్మద్ పటేల్ నియమించారు. మోతీలాల్ వోరాను ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అస్సాం మినహా ఈశాన్య రాష్ట్రాల ఇన్చార్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న సీపీ జోషీ స్థానంలో లుజిన్హో ఫలేరియోను, విదేశీ వ్యవహారాల విభాగం అధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కరణ్ సింగ్ స్థానంలో మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మను నియ‌మకం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితురాలిగా లోకో స‌భ మాజీ స్పీకర్ మీరా కుమార్ నియామకం చేస్తున్న‌ట్లు రాహుల్ తెలిపారు.