దేవుడు దిగొచ్చినా కేసీఆర్ ఆ స‌భ నిర్వ‌హించ‌లేరు..

దేవుడు దిగి వచ్చిన సెప్టెంబర్ 2న కేసీఆర్ సభ నిర్వహించలేరని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మాయమాటలు ప్రజలు వినే రోజులు పోయాయని, సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ పెడతానని కేసీఆర్ చెప్పినా అది సాధ్యం కాదని నిఘావర్గాలు నివేదిక ఇచ్చాయని ఆయ‌న చెప్పారు. ప్రజలు పూర్తి వ్యతిరేకత తో ఉన్నారని సీఎం కు అందిన నివేదికలో ఉందన్నారు రేవంత్. కేసీఆర్ కు చేతనైతే చెప్పిన విధంగా ప్రగతి నివేదన సభ పెట్టాలని స‌వాల్ విసిరారు.

ప్రగతి నివేదన సభ పెడితే ఇచ్చిన హామీలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమ‌ని రేవంత్ ఛాలెంజ్ చేశారు. సమస్యలనుంచి దృష్టి మరల్చేందుకు, పార్టీలో తిరుగుబాటు నుంచి బయటపడేందుకే కేసీఆర్ ముంద‌స్తు నాట‌క‌మాడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.