సీనియర్‌ పాత్రికేయులు కుల్‌ దీప్‌ నయ్యర్‌ కన్నుమూత

సీనియర్‌ పాత్రికేయులు కుల్‌ దీప్‌ నయ్యర్‌ (95) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్థరాత్రి తి చెందారు.

కుల్దీప్ నయ్యర్ 1923లో ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న సియాల్ కోట్ లో జన్మించారు. లాహోర్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. జర్నలిజం వృత్తిగా స్వీకరించి సుప్రసిద్ధ పత్రికా రచయితగా బహు పత్రికలు సిండికేట్ చేసిన ఆయన వ్యాసాలను ప్రచురిస్తున్నాయి. ప్రముఖ తెలుగు పత్రిక ఈనాడులోనూ ఆయన రాసిన వ్యాసాలు ప్రచురితం అవుతూ ఉండేవి.

‘అంజాయ్` అనే ఉరూద్ద పత్రికల్లో జర్నలిస్టుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన నయ్యర్ వి.పి.సింగ్ ప్రభుత్వకాలంలో లండన్ లో భారత హైకమీషనర్ గానూ, రాజ్యసభ సభ్యుడిగానూ ఎదిగాడు. పత్రికా స్వేచ్ఛపట్ల, మానవహక్యుల పట్ల నిబద్ధత కలిగినవాడు. భారత పాకిస్తాన్ సంబంధాలను మెరుగుపచడం కోసం కృషి చేసి ఇరుదేశాల్లోనూ అభిమానాన్ని సంపాదించుకున్నాడు. డజనుకుపైగా పుస్తకాలు రచించాడు. ఎందరో ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేశాడు.