‘నవాబ్’ ట్రైలర్.. వచ్చేసింది !

ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘చక్క చివంత వానం’. తెలుగులో ‘నవాబ్’గా తీసుకొస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. విజయ్ సేతుపతి, అరవింద్ సామి, జ్యోతిక, అదితీ రావు హైదరీ, ఐశ్వర్యా రాజేష్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 28న ‘నవాబ్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

తాజాగా, ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ముగ్గురు గ్యాంగ్ స్టర్స్ అన్నదమ్ముల కథ ‘నవాబ్’గా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. తముళ్లిద్దరు అన్న అరవింద స్వామి స్థానంలోకి రావాలనే ఆశతో ఉన్నట్టు చూపించారు. విజయ్ సేతుపతి పోలీస్ డ్రెస్ లో కనిపించాడు. జ్యోతిక అరవింద స్వామి భ్యార్యగా కనిపించింది. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండీ.. !