అఖిల్ బాలీవుడ్ సినిమా.. కరణ్ జోహార్ నిర్మాత ?

అఖిల్ అక్కినేని.. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే స్టార్ హీరో రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకొన్నాడు. అందంలో అఖిల్ ని మహేష్ తో పోల్చిచూసుకొన్నారు. తెలుగు తెరకు మరో మహేష్ బాబు రాబోతున్నాడు చెప్పుకొన్నారు. ఐతే, ఆ అంచనాలని అఖిల్ అందుకోలేకపోయాడు. ఆయన తొలి చిత్రం ‘అఖిల్’ అట్టర్ ప్లాపు అయ్యింది. ఆ తర్వాత కసితో చేసిన ‘హలో’ అఖిల్ కు మంచి పేరునే తీసుకొచ్చింది. ఐతే, ‘హలో’ కమర్షియల్ గా ఆడలేదు.

ప్రస్తుతం అఖిల్ ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇదో రొమాంటిక్ ఎంటర్ టైనర్. అఖిల్ సరసన నిధి అగర్వాల్ జతకట్టనుంది. ఈ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్. ఐతే, ఈ సినిమా తర్వాత అఖిల్ బాలీవుడ్ వెళ్లనున్నట్టు సమాచారమ్. నటుడు ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్‌ దర్శకత్వంలో అఖిల్ సినిమా ఓ సినిమా చేయబోతున్నాడట.

ఈ సినిమాని తెలుగు, హిందీలోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని నాగార్జునతో కలిసి బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ నిర్మించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటి వరకు అఖిల్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. తెలుగులోనే తన సత్తా ఏంటో చూపించలేదు. అప్పుడే బాలీవుడ్ కు అంటే.. అఖిల్ సాహాసం చేసినట్టే.. !!