టీఆర్ఎస్ భ‌వ‌న్ లో వంద‌కోట్లు పంచారు..!

కేసీఆర్, టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఎల్పీ మీటింగ్ సంద‌ర్భంగా కేసీఆర్ర ఎమ్మెల్యేల‌కు ఇచ్చిన డ‌బ్బాల్లో ఒక్కో ఎమ్మెల్యేకు కోటి ఇచ్చార‌ని ఆయ‌న ఆరోపించారు. ఒక్క‌రోజేటీఆర్ఎస్ భ‌వ‌న్ లో వంద‌కోట్లు పంచార‌న్నారు. కోటి ఇచ్చార‌ని కొంద‌రు ఎమ్మెల్యేలే త‌న‌తో చెప్పార‌ని, త‌మ వ‌ద్ద ప‌క్కా స‌మాచారం ఉంద‌ని, దీనిపై నిఘా వ‌ర్గాలు త‌క్ష‌ణ‌మే విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ తెలంగాణ బీజేపీ శాఖ అని, కేసీఆర్ కు అధిష్టానం మోడీ అని రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధిష్టానం గ‌ల్లీలో ఉంటే ఢిల్లీకి ఎందుకు వెళుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేసీఆర్ కు స‌హాని అనే చీక‌టి స్నేహితుడున్నాడ‌ని, ఢిల్లీలో స‌హానీ లీల‌లు బ‌య‌ట‌పెట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ముంద‌స్తు కోస‌మే కేసీఆర్ గూడుపుఠాని చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.