టీజేఎస్ లో చేరిన కాంగ్రెస్ నేత కుమారుడు…

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు మర్రి ఆదిత్యరెడ్డి తెలంగాణ జ‌న‌స‌మితి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీకార్యాల‌యంలో కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ అధ్య‌క్ష‌డు కోదండ‌రాం. సేవా దృక్ప‌థం ఉన్న‌వారు రాజకీయాలలోకి రావడం మంచి పరిణామమ‌ని అన్నారు కోదండ‌రాం. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జ‌రుగుతోంద‌ని, అధికారులు దుర్వినియోగం చేస్తే వారి పై కోర్ట్ కు వెళతామ‌ని కోదండ‌రాం అన్నారు.

సెప్టెంబర్ 2న సభకు అధికార యంత్రాంగాన్ని వాడుకోరాదని, స్కూలు బస్సులకు అనుమతివ్వరాదని కోదండ‌రాం అన్నారు. దుర్వినియోగానికి పాల్పడిన వారిపై ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేస్తామ‌న్నారాయ‌న‌. కోదండ‌రాం స్పూర్తితోనే పార్టీలోకి వచ్చాన‌ని మ‌ర్రి ఆదిత్య రెడ్డి అన్నారు.