‘అరవింద సమేత’పై ఆశలు వదులుకోవాల్సిందే.. !

‘అరవింద సమేత’పై పెట్టుకొన్న బోలేడు ఆశలు ఇక వదులుకోవాల్సిందే. ఈ సినిమా నుంచి రెండో టీజర్ రాబోతుంది. అది కూడా రాఖీ పండగ కానుకగా అనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నిజమే అయి ఉంటుందని ప్రేక్షకులు నమ్మారు. ఎందుకంటే.. ఎన్టీఆర్’కు రాఖీ పండగ వెరీ స్పెషల్. ‘రాఖీ’ సినిమాతో ఆయన ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ సెంటిమెంట్ తోనైనా పండగ పూట ‘అరవింద సమేత’ రెండో టీజర్ ని వదులుతారని అభిమానులు ఆశపడ్డారు. ఐతే, ఆ ఆశలపై తారక్ నీళ్లు చల్లారు. రాఖీ గిఫ్ట్ లేదని తేల్చిచెప్పాడు.

రాఖీ గిఫ్ట్ యే కాదు. అసలు అరవింద సమేత రెండో టీజర్ నే లేదు. నేరుగా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నామని చిత్ర నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రైలర్ విడుదల తేదిని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. దీంతో.. అరవింద సమేత రెండో టీజర్ పై అభిమానులు పెట్టుకొన్న ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అది అదిరిపోయింది. తారక్ రంగంలోకి దిగితే ఎట్టుట్టదో తెలిపింది.

‘కంటపడ్డావా కనికరిస్తానేమో..వెంటపడ్డావా నరికేస్తావోబా’ అంటూ తారక్‌ రాయలసీమ యాసలో చెప్తున్న డైలాగ్ టీజర్ లో హైలైట్‌గా నిలిచింది. ఎన్టీఆర్’లో మాస్ యాంగిల్ ని ఇష్టపడే అభిమానుల కడుపు నింపింది. ఇక, రెండో టీజర్ వస్తే.. అది త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కూడినదై ఉంటుందని అనుకొన్నారు. అసలు టీజర్ నే లేదనే విషయం కాస్త ఆలస్యంగా తెలిసింది. ఇక, అందిరి చూపులు ట్రైలర్ పైనే. ఇంకేం చేయలేం.. వెయిట్ చేయడం తప్ప.

ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.