అమెరికాలో మళ్లీ కాల్పులు

అగ్రరాజ్యం అమెరికాని మరోసారి తుపాకీ కాల్పులు వణికించాయి. ఫ్లోరిడాలోని జాక్సన్‌ విల్లేలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగరు మృతి చెందారు. 11 మందికి తీవ్ర గాయాలయ్యారు. మాడెన్‌ NFL (అమెరికన్ పుట్ బాల్ వీడియో గేమ్) ఛాంపియన్ షిప్ సిరీస్ నిర్వహిస్తున్న ఏరియాలో కాల్పులు జరిగాయి. కాగా, ఇటీవల అమెరికాలోని కాన్సస్ నగరంలో జరిగిన కాల్పులలో వరంగల్ పట్టణానికి చెందిన కొప్పు శరత్ అనే విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐతే, తాజా కాల్పుల్లో తెలుగువారు ఉన్నట్టు సమాచారం ఏమీ అందలేదు.