వ‌రంగల్ టీఆర్ఎస్ లో భ‌గ్గుమ‌న్న విభేదాలు.

సెప్టెంబ‌ర్ 2న హైద‌రాబాద్ లో జ‌రిగే టీఆర్ఎస్ పార్టీ ప్ర‌గ‌తి నివేద‌న బ‌హిరంగ స‌భ జ‌న సమీక‌ర‌ణ‌కు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో నెక్కొండ మండ‌ల కేంద్రంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం జ‌రిగింది. తెలంగాణ రాష్ట్ర సివిల్ స‌ప్ల‌య్ కార్పోరేష‌న్ చైర్మ‌న్ పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో వ‌ర్గ విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. పెద్ది సుద‌ర్శ‌న్ స‌మ‌క్షంలోనే రెండు వ‌ర్గాలు ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు.

స‌మావేశం జ‌రుగుతున్న స‌మ‌యంలో ఒక కార్య‌క‌ర్త పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డితో వాగ్వాదానికి దిగాడు. ఆయ‌న వారించినా , స‌ర్థి చెప్పే ప్ర‌య‌త్నం చేసినా ఆ కార్య‌క‌ర్త విన‌లేదు. దీంతో రెండు వ‌ర్గాలు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఘ‌ర్ష‌ణ‌కు దిగారు.