ఇక విజయవాడలోనే మహేష్ మకాం


వివాదాస్పద సినీ, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఇకపై విజయవాడలోనే ఉండబోతున్నానని తెలిపారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌ పై హైదరాబాద్ పోలీసులు ఆర్నెళ్ల పాటు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. ఆయన్ని ఏపీలో చిత్తూరు జిల్లాలో విడిచిపెట్టి వచ్చారు. అక్కడి నుంచి ఆయన బెంగళూరు వెళ్లారు. అక్కడ కొద్దిరోజు ఉండి.. ఈరోజే ఏపీకి తిరిగొచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన మహేష్ కత్తిని మీడియా పలకరిచగా.. ఇకపై తాను విజయవాడలోనే ఉండబోతున్నట్లు ప్రకటించాడు. తనది ఏపీయే.. ఇకపై ఇక్కడే ఉండబోతున్నానని తెలిపారు.