‘మా’ వివాదంలోకి శ్రీరెడ్డి.. !

‘మా’ వివాదం ముదురుతోంది. ‘మా’ నిధులు దుర్వినియోగంపై ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. అది నిజమేనని మా కార్యదర్శి, సీనియర్ నటుడు నరేష్ మీడియా ముందుకొచ్చి చెప్పడంతో.. ఈ వివాదం ముదిరింది. అంతకంటే ముందే ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, శ్రీకాంత్ లు మీడియా ముందుకొచ్చి అవినీతి ఆరోపణలు ఖండించారు. ప్రతిది పక్కగా ఉంది. కావాలంటే వచ్చి చెక్ చేసుకోవచ్చున్నారు. ఈ ఏపీసోడ్ లో కొందరు శివాజీరాజాని, మరికొందరు నరేష్ ని సపోర్టు చేస్తుండటంతో మా రెండు వర్గాలుగా చీలిపోయినట్టు స్పష్టంగా కనబడుతోంది. తాజాగా, ఈ వ్యవహారంపై నటి శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందించారు.

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై తాను చేసిన పోరాటాన్ని శివాజీరాజా, శ్రీకాంత్ లు పబ్లిక్ స్టంట్ అన్నారు. తాను మోసమోయానని వస్తే.. ఓదార్చాల్సిపోయి.. బడా ఫ్యామిలీని కాపాడే ప్రయత్నం చేశారు. బోకర్స్ లా వారితో తనకి కోట్ల డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నంచారు. ఇప్పుడు వారి గోచి ఊడి దరిద్రపు గతి పట్టిందని అన్నారు శ్రీరెడ్డి. ఈ మేరకు ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. శివాజీ రాజా అండ్ కో ఆడ పిల్లని కాల్చుకు తినే బ్రోకర్స్. సెటిల్ మెంట్స్ చేసే గుండాలు అంటూ తీవ్ర విమర్శలు చేసింది. అక్కడితో ఆగకుండా తన తల్లిదండ్రులనే చూడలేని శివాజీ రాజా ముసలోళ్లకి వృద్దాశ్రమం కడతారా?అని విమర్శించింది.