నేటి నుంచి ఏపీ అసెంబ్లీ… సేమ్ సీన్ రిపీట్ చేసిన వైసీపీ..

గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మయ్యాయి. ఇప్ప‌టికే బీఏసీ స‌మావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశంలో శాస‌న‌స‌భ ఎన్నిక‌రోజులు నిర్వ‌హించాల‌నే అంశంపై ఓ క్లారిటీ ఇవ్వ‌నుంది. అసెంబ్లీ స‌మావేశాలు ఎన్నిరోజులు నిర్వ‌హించాలో ఖ‌రారు చేయ‌నుంది. అయితే విప‌క్ష వైసీపీ మాత్రం ఈ స‌మావేశాల్లో కూడా మ‌ళ్లీ అదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోంది.

వైసీపీ నేతలు సభకు రాకుండా గైర్హాజరు కావడంపై అధికార టీడీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. రైతుల త్యాగాలను భ్రమరావతి అంటూ జగన్‌ హేళన చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. బాధ్యతలు మరచి లేఖలతో జగన్‌ కాలయాపన చేస్తున్నార‌ని, అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నార‌ని మంత్రి దేవినేని విర్శించారు. పట్టిసీమ జలాలతో డెల్టా రైతులు ఆనందంగా ఉన్నార‌ని ఆయ‌న అన్నారు.