డెసిష‌న్ డే: రాజ‌కీయ భ‌విత‌వ్యంపై కొండా దంప‌తుల కీల‌క నిర్ణ‌యం!!

వ‌రంగ‌ల్ జిల్లాలో టీఆర్ఎస్ నేత‌ల‌తో చాలాకాలంగా ఇంట‌ర్నల్ వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజ‌గా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మొద‌టి జాబితాలో కొండా సురేఖ పేరును పెండింగ్ లో పెట్ట‌డం వారి రాజ‌కీయ భ‌విష్య‌త్ ను గంద‌ర‌గోళంలో ప‌డేసింది. వ‌రంగ‌ల్ మేయ‌ర్ కు , కొండా దంప‌తుల‌కు మ‌ధ్య ఓ రేంజ్ లో వార్ న‌డిచింది. టికెట్ ఎవ‌రికి వ‌స్తుందో చూద్దాం అనే వ‌ర‌కు ఆ ఇష్యూ వెళ్లింది కూడా. కేటీఆర్ తో భేటీ అయినా టిక్కెట్ పై క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో కొండా దంప‌తులు కాంగ్రెస్ గూటికి చేర‌తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ ఎలాంటి హామీఇవ్వ‌క‌పోవ‌డం, టికెట్ పై క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ పై కొండా దంప‌తులు అనుచ‌రుల‌తో చ‌ర్చించారు. దాదాపుగా కాంగ్రెస్ గూటికి చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్య అనుచ‌రుల‌కు ఆ దిశ‌గా సంకేతాలిచ్చారు కొండా సురేఖ‌. హైదరాబాద్ లో భేటీ త‌రువాత భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌న‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్రెస్ మీట్ పెట్టి రాజ‌కీయ భ‌విష్య‌త్ పై నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తార‌ని తెలుస్తోంది.