‘అరవింద సమేత’ ఆడియో వేడుక క్యాన్సిల్ !

త్రివిక్రమ్-తారక్’ల కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అరవింద సమేత’. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఈ నెల 20న ఈ సినిమా ఆడియో వేడుకని ప్లాన్ చేశారు. ఈ వేడుకకి బాలకృష్ణ, మహేష్ బాబులలో ఒకరు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్టు ప్రచారం జరిగింది. వీరిద్దరు కాకుండా బిగ్ బీ అమితాబ్ గెస్ట్ గా వస్తారనే ప్రచారం మొదలైంది.

తాజా సమాచారమ్ ప్రకారం ‘అరవింద సమేత’ ఆడియో వేడుక క్యాన్సిల్ అయ్యింది. అడియోను నేరుగా ఆన్ లైన్ లోకి వదిలేస్తారు. దీనికి బదులుగా సినిమా విడుదలకు ఒకట్రెండు రోజుల ముందు ప్రీ-రిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించనున్నారు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. యాక్షన్ హైలైట్ గా ఉండబోతుందని చెబుతున్నారు.
ఈ చిత్రంలో తారక్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. థమన్ సంగీతం. రాథాకృష్ణ నిర్మాత.