కాంగ్రెస్’లో చేరిన బండ్ల గణేష్

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు తెరాస ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, తెరాసకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశిస్తునట్టు తెలుస్తోంది. ఇక, బండ్ల గణేష్ కు జూబ్లీహీల్స్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ‘తనకు కాంగ్రెస్‌ అంటే ఇష్టం. అందుకే ఆ పార్టీలో చేరా. రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకే పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటా. అన్నారు బండ్ల.

ప్రస్తుతం బండ్ల గణేష్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన నిర్మించిన ఆఖరి చిత్రం ‘టెంపర్’. ఈ సినిమా మంచి లాభాలని తెచ్చిపెట్టింది. ఐతే, అప్పటికే బండ్లకు ఆర్థిక కష్టాలు ఎక్కువయ్యాయని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో సినిమాలు మానేసిన బండ్ల.. సొంత వ్యాపారాలని చూసుకొంటున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు.