పవన్ కథతో వెంకీ సినిమా !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ‘అజ్ఝాతవాసి’ సినిమా తర్వాత ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అసలు సినిమాల వైపు చూడటం లేదు. ఈ నేపథ్యంల్ ఆయన కోసం రాసుకొన్న కథలు ఇతర హీరోల దగ్గరకు వెళ్తున్నాయి. ఇలా పవన్ కోసం ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ రాసుకొన్న ఓ కథ వెంకీ వద్దకు వెళ్లినట్టు సమాచారమ్.

‘అజ్ఝాతవాసి’ తర్వాత పవన్ తో త్రివిక్రమ్ మరో సినిమా చేయాల్సి ఉంది. అప్పటికే త్రివిక్రమ్ అనుకొన్న ఓ లైన్ ని పవన్ కి వినిపించడం.. అది ఆయనకు బాగా నచ్చేయడం జరిగిపోయిందట. ఆ లైన్ ని సినిమాగా తీద్దామని ఇద్దరు అనుకొన్నారంట. ఐతే, ఈలోపు పవన్ పొలిటిక్స్ బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో పవన్ మళ్లీ సినిమాలు చేసే అవకాశాలు కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో పవన్ కోసం అనుకొన్న కథని వెంకీతో తీసేందుకు త్రివిక్రమ్ రెడీ అయినట్టు తెలిసింది. ఇటీవల త్రివిక్రమ్ వెంకీని కలిసి కథని కూడా వినిపించాడట. ఆ కథ వెంకీకి బాగా నచ్చేసింది. ‘అరవింద సమేత’ తర్వాత ఆ కథతో సెట్స్ మీదకు వెళ్లనున్నారు త్రివిక్రమ్-వెంకీ. గతంలో వీరి కలయికలో వచ్చిన నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.