శ్రీరెడ్డికి పొలిటికల్ ఆహ్వానం !

వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై రాజకీయ పార్టీలు ఒత్తిడి చేస్తున్నాయట. ఆమె తమ పార్టీలో చేరమని రెండు, పార్టీలు అడుగుతున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీరెడ్డినే తెలిపింది. తాజాగా, ఆమె సైదాబాద్ లో ఓ బేకరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చింది.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీరెడ్డి.. తనని పొలిటికల్ పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. ఇప్పటికే ఒకట్రెండు పార్టీలు అడిగాయి. ఐతే, రాజకీయాలపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పింది. అదే సమయంలో జనసేనపై షాకింగ్ కామెంట్స్ చేసింది. జనసేన పార్టీకి ఘోర పరాభవం తప్పదు. ఆ పార్టీ కేవలం 3-4 సీట్లకే పరిమితమయ్యే అవకాశముందని చెప్పుకొచ్చింది.