‘దాగుడుమూతలు’ హీరోలు దొరికారట !

‘దాగుడుమూతలు’ దర్శకుడు హరీష్ శంకర్ దగ్గర రెడీగా ఉన్న మల్టీస్టారర్ కథ ఇది. ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’ తర్వాత వెంటనే దిల్ రాజు బ్యానర్ లో చేయాల్సిన సినిమా. దీనికోసం హరీష్ శంకర్ ఫారిన్ వెళ్లి లొకేషన్స్ కూడా చూసొచ్చాడు. స్టార్ హీరోలతో దాగుడుమూతలు ఆడించబోతున్నట్టు హింట్ ఇచ్చాడు కూడా. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఫైనల్ గా ఈ కథపై దిల్ రాజుకు నమ్మకం లేదని.. సినిమా ఆగిపోయిందని బయటకు తెలిసింది.

అయినా.. ఈ మల్టీస్టారర్ కోసం హరీష్ ప్రయత్నాలు ఆపలేదు. ఇప్పుడీ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. స్నేహితుల సహాయంతో హరీష్ ఈ సినిమాని సొంతంగా నిర్మించబోతున్నట్టు సమాచారమ్. ఈ మల్టీస్టారర్ కోసం సుధీర్ బాబు, రామ్ లని అనుకొన్నాడట. ఇప్పటికే సుధీర్ బాబు ఓకే చెప్పేశాడని తెలిసింది. త్వరలోనే రామ్ ని కలిసి కథని చెప్పనున్నాడట హరీష్. రామ్ ఓకే చెబితే.. త్వరలోనే ‘దాగుడుమూతలు’ సెట్స్ మీదకు వెళ్లనుంది. మరీ.. ఈ ఆట ఆడేందుకు ఒప్పుకొంటాడేమో చూడాలి.