ఆసియా కప్ : బంగ్లాపై భారత్ భారీ విజయం


ఆసియా కప్ సూపర్ – 4 సమరాన్నీ టీమిండియా ఘనంగా ఆరంభించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 49.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా (4/29), భువనేశ్వర్‌ (3/32), బుమ్రా (3/37) విజృంభించారు. మిరాజ్‌ (42; 50 బంతుల్లో 2×4, 2×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ భారత్‌ 36.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. రోహిత్‌ శర్మ (83 నాటౌట్‌; 104 బంతుల్లో 5×4, 3×6) , ధావన్‌ (40; 47 బంతుల్లో 4×4, 1×6) రాణించారు. భారత్‌ తన తర్వాతి సూపర్‌-4 మ్యాచ్‌లో ఆదివారం పాకిస్థాన్‌తో తలపడుతుంది.