‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ ట్రైలర్ టాక్

బాలీవుడ్ సూపర్‌ స్టార్స్ అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’. కత్రినా కైఫ్‌, ఫాతిమా సనా షేక్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‌విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకుడు. యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌ 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ముంబయిలోని వడాలా ప్రాంతంలో ఉన్న ఐమ్యాక్స్‌ థియేటర్‌లో ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. ‘ఈస్ట్‌ ఇండియా దొరలు భారతదేశంలో వ్యాపారం చేయడానికి వచ్చారు. ఈ క్రమంలో భారతీయులను తమ బానిసలను చేసుకున్నారు. ఈ బానిస బతుకు నచ్చని కొందరు భారతీయులు తిరగబడాలనుకున్నారు’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది.

ఖుదాబక్ష్‌ (అమితాబ్‌)ను చంపడానికి మరో తెలివైన హిందుస్థానీ దోపిడీదారుడిని దింపాలని బ్రిటిష్‌ దొరలు పథకం రచిస్తారు. ఇందుకోసం ఫిరంగి (ఆమిర్‌)ను దింపుతారు. ‘స్వేచ్ఛను అమ్ముకుంటున్నాను. బేరం ఆడకండి హుజూర్’ అంటూ ఆమిర్‌ చేసే హంగామా ఫన్నీగా ఉంటుంది. నర్తకిగా సురైయా (కత్రినా) తన అందం, డ్యాన్స్‌తో ఆకట్టుకుంటుంది. చివరి సన్నివేశంలో ఆమిర్‌, అమితాబ్ మధ్య వచ్చే‌ యుద్ధం సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ట్రైలర్ ని మీరు చూసేయండీ.. !