షాక్ : నానా పటేకర్ కనిపించడం లేదు

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ కనిపించడం లేదు. ఇటీవల ఆయనపై హీరోయిన్ తనుశ్రీ దత్తా లైగింక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2009లో వచ్చిన ‘హార్న్‌ ఒకే ప్లీజ్‌’ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ ‌తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించింది. ఈ ఏపీసోడ్ లో క్రమంగా తనుశ్రీకి సపోర్టు పెరుగుతోంది. ట్వింకిల్‌ ఖన్న, సోనమ్‌ కపూర్‌, ప్రియాంక చోప్రా. అర్జున్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, ఫర్హాన్‌ అక్తర్‌లు.. తదితరులు తనుశ్రీకి సపోర్టుగా నిలిచారు.

ఇక, తను శ్రీ ఆరోపణలపై నానా పటేకర్ గట్టిగానే స్పందించారు. అసలు లైంగిక వేధింపులు అంటే ఏమిటీ ? అని ప్రశ్నించారు. షూటింగ్ స్పాట్ లో 200మందికిపైగా ఉంటారు. ఆ సమయంలో లైంగిక వేధింపులు పాల్పడినట్టు ఆరోపించడంలో అర్థలేదన్నట్టుగా ఆయన స్పందించారు. ఐతే, ఉన్నట్టుండి నానా పటేకర్ అజ్ఝాతంలోకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆయన ‘హౌజ్‌ఫుల్‌ 4’లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్రబృందం గురువారం జైసల్మేర్ బయలుదేరి వెళ్లింది.

ఈ చిత్రబృందంతో నానా పటేకర్‌ మిస్సయ్యారు. ఆయన ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కనీసం ఎక్కడికి వెళ్లారో చిత్రబృందానికి కూడా చెప్పలేదట. దీంతో ఆయనపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలని వాయిదా వేసినట్టు తెలిసింది. ఇంతకీ నానా పటేకర్ ఎక్కడి వెళ్లినట్టు.. ? ఆయన తనుశ్రీ ఆరోపణలతో డిప్రెషన్ లోకి వెళ్లాడా.. ?? అనే ప్రచారం జరుగుతోంది.