ఏంటీ.. రేవంత్ ? ఈ రివర్స్ కామెంట్స్ !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి రివర్స్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన తాజా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాగోతం బయటపెట్టాడట. అందుకే తనపై రాజకీయ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తనపై ఐటీ దాడులు జరిగాయని రేవంత్ ఆరోపించారు. ఆయన ఇంట్లో ఐటీ దాడుల తర్వాత రేవంత్ ఆదివారం తొలిసారి ప్రజల ముందుకొచ్చారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్‌ లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి కేసీఆర్ పై మండిపడ్దారు.

కేసీఆర్‌ బాగోతం బయటపెట్టినందుకే తనపై ఐటీ దాడులు చేయించారని రేవంత్ ఆరోపించారు. ఈ మాటలు విని సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు కేసీఆర్ ని రేవంత్ బాగోతం బయటపెట్టారు కదా. ఓటుకు నోటు కేసులో రేవంత్ అడ్డంగా దొరికాడు. ఈ కేసులో కొన్నాళ్లు జైల్లో ఉండొచ్చారు కూడా. ఇటీవల జరిగిన ఐటీ సోదాల్లోనూ ఆయన దగ్గర రూ. 20కోట్ల బ్లాక్ మణి ఉన్నట్టు గుర్తించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ బాగోతం బయటపడినట్టవుతుంది. కానీ, కేసీఆర్ బాగోతం ఎలా అవుతుంది.. ? అనే కామెంట్స్ చేస్తున్నారు జనాలు.