కేటీఆర్ సోషల్ డైలాగ్.. అదుర్స్ !

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అంతేకాదు.. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందిస్తారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ సోషల్ మీడియాని కేటీఆర్ బాగానే వాడుకొంటున్నారు. ఈ మధ్య ఓ లైన్ సోషల్ మీడియాలో వైరల్’గా మారింది.

అదేంటీ అంటే..

‘కాంగ్రెస్ కు ఓటెస్తే ఢిల్లీకి పోతుంది’

‘తెదేపాకు వేస్తే అమరావతికి వెళుతుంది’

‘కోదండరాం పార్టీకి ఓటేస్తే ఎటు కాకుండా పోతుంది’

‘టీఆర్ఎస్’కు ఓటేస్తే మన దగ్గరే ఉంటుంది’ అనే లైన్స్ నెటిజన్స్ ని బాగా ఆకట్టుకొంటునాయి.

ఇప్పుడీ లైన్స్ ని కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో వాడేసుకొంటున్నారు. ఆదివారం తెలంగాణభవన్‌లో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల తాజా మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్‌, ఏనుగు రవీందర్‌రెడ్డిల నేతృత్వంలో కాంగ్రెస్‌, భాజపా, ఆర్యవైశ్య సంఘం నేతలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ లైన్స్ చెప్పి ఆకట్టుకొన్నారు. ఇది విని ఆయన అభిమానులు కేటీఆర్ సోషల్ డైలాగ్ అదుర్స్ అంటున్నారు.