తెలుగు సినిమాపై జాన్వీ క్లారిటీ

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా తొలి ప్రయత్నంలోనే విజయం అందుకొంది. జాన్వీ తొలి చిత్రం ‘ధడక్‌’తో బ్లాక్ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. ఇషాన్ ఖత్తర్‌, జాన్వి జంటగా నటించిన ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. జాన్వీరెండో చిత్రం ‘తఖ్త్‌’ కూడా కరణ్‌ జోహార్‌ బ్యానర్ లోనే తెరకెక్కుతోంది. ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌, విక్కీ కౌశల్‌, కరీనా కపూర్‌, ఆలియా భట్‌, భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

జాన్వీ ఆమె తల్లి మాదిరిగా దక్షిణాదిన రాణించాలని ఆశపడుతోంది. ఇందులో భాగంగా.. రెండు తమిళ సినిమాలు.. ఓ తెలుగు సినిమాలో నటించబోతుంది. తెలుగులో ఆమె యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండ సరసన జతకట్టబోతుందనే ప్రచారం జరిగింది. తాజాగా, ఈ ప్రచారంపై జాన్వీ స్పందించింది. ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టానని.. నటిగా ఇక్కడ స్ధిరపడ్డ తర్వాతే దక్షిణాది సినిమాలు గురించి ఆలోచిస్తాను తేల్చేసింది.