ఆ తపనే విజయ్’ని నిర్మాత చేసిందట !

యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండ సడెన్ గా నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన తొలి ద్విబాషా చిత్రం ‘నోటా. ఆనంద్‌ శంకర్‌ దర్శకుడు. ఈ సినిమా నిర్మాణంలో నిర్మాత జ్ఝానవేల్ రాజాతో కలిసి విజయ్ భాగస్వామ్యం అయ్యారు. భారీ అంచనాల మధ్య ‘నోటా’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొంది. దీంతో తెరపై విజయ్ హోమ్ ప్రొడక్షన్ ‘కింగ్ అఫ్ హీల్స్’ లోగో బాగుందని చెప్పుకొంటున్నారు.

ఇంతకీ సడెన్ గా విజయ్ నిర్మాతగా ఎందుకు మారినట్టు ? దీనికి ‘నోటా’ ప్రమోషన్స్ లో విజయ్ సమాధానం చెప్పారు. “ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేశా. ‘పెళ్ళిచూపులు’ సినిమా హిట్‌ అవుతుందని నేను, డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ నమ్మకంగా ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. మా అంత బలమైన నమ్మకంగా ఉన్నవారు దొరికితే సినిమా స్టార్ట్‌ చేస్తా”నని తెలిపారు. ఇంకేందుకు ఆలస్యం ప్రతిభావంతులు ప్రయత్నించండి.. !