రాజమౌళి మల్టీస్టారర్ స్టోరీ లైన్.. ఇదే !

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే బాహుబలి అంతకుమించి మల్టీస్టారర్ ని ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారమ్.

నవంబర్ లో సినిమాని ప్రారంభించి వచ్చే యేడాది జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ కు వెళ్లాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇప్పుడీ సినిమా గురించి ఓ అప్ డేట్ వచ్చింది. ఇది స్వాతంత్య్ర ఉద్యమం నాటి కథని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్ సిటీలో ఓ భారీ సెట్ వేస్తున్నారు. అది స్వాత్రంత్య్ర కాలం నాటిది లాగా ఉండటంతో.. ఆ ప్రచారం నిజమేనని చెబుతున్నారు.