సైనా పెళ్లి డేటు చెప్పేసింది

భారత బ్యాడ్మింటన్‌ ప్రేమజంట సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్‌ల పెళ్లి డేటు ఫిక్సయ్యింది. ఇటీవలే వీరి ప్రేమ విషయం బయటకి తెలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ విషయంపై సైనా స్పందించింది. కశ్యప్ తో ప్రేమ గురించి సవివరంగా తెలిపింది. దాంతో పాటు పెళ్లి డేటు కూడా చెప్పేసింది. 2007లోనే సైనా-కశ్యప్ ప్రేమలో పడిపోయారట. అప్పటి నుంచి బిజీగా ఉన్న తరచూ మాట్లాడుకొనేవారట. వీరి ప్రేమ గురించి ఇంట్లో చెప్పి ఒప్పించాల్సిన అవసరం కూడా రాలేదట. వీరి తీరుని చూసి వాళ్లే అర్థం చేసుకొన్నారంట.

మరీ ఇన్నాళ్లు పెళ్లి మాట ఎత్తకపోవడానికి కారణం.. కెరీర్ పై ఫోకస్ చేయడమేనని సైనా చెప్పుకొచ్చింది. మా దృష్టిలో టోర్నీలు గెలవడం అన్నింటికన్నా చాలా ముఖ్యం. అందుకే మా దృష్టి వేరే విషయాల మీదకు మరలకుండా జాగ్రత్తపడ్డాం. చిన్న పిల్లలకు ఎంత కేర్ అవసరమో ప్లేయర్స్‌కు కూడా అంతే కేర్‌ అవసరమని సైనా తెలిపింది. ఇక, ఈ యేడాది డిసెంబర్ 16న పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపింది. ఆ రోజే ఎందుకంటే డిసెంబర్ 20 తర్వాత మళ్లీ ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌తో బిజీ అవుతాము. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఉంటాయి. అందుకే ఆ లోపే పెళ్లి తంతు పూర్తి చేద్దామని నిర్ణయం తీసుకొన్నట్టు సైనా తెలిపింది.