#మీటూ : తెరపైకి కొత్త డిమాండ్

దేశంలో #మీటూ ఉద్యమం ఊపందుకొంది. అన్ని రంగాలకి పాకింది. సినీ, రాజకీయ, కార్పోరేటు, క్రీడారంగంలోనూ ఇలాంటి ఆరోపణలొస్తున్నాయ్. ఐతే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అందులో నిజం లేదని వాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. వారికి లై డిటెక్టర్‌ టెస్ట్‌ తీసుకోవాలి బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

సింగర్ చిన్మయి శ్రీపాద దక్షిణాదిన #మీటూ ఉద్యమాన్ని ప్రారంభించింది. తనని ప్రముఖ రచయిత వైరముత్తు లైంగిక వేధించినట్టు ఆరోపించింది. ఐతే, ఆమె ఆరోపణలు అబద్దం అన్నట్టుగా వైరముత్తు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘వైరముత్తుగారూ.. మాట్లాడింది చాలు. ఆయన లై డిటెక్టర్‌ టెస్ట్‌ తీసుకోవాలి’ అని చిన్మయి ట్వీట్‌ చేసింది.

ఇప్పుడు బాలీవుడ్ లో #మీటూ ఉద్యమాన్ని ప్రారంభించిన తనుశ్రీ దత్తా కూడా ఇదే డిమాండ్ చేస్తోంది. నానా పటేకర్ తో పాటు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారంతా లై డిటెక్టర్‌ టెస్ట్, నార్కో అనాలసిస్‌ పరీక్షలు చేయించాలని తనుశ్రీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది.