#మీటూ : హీరోయిన్ ఆరోపణలపై ధోని రియాక్షన్

దేశ వ్యాప్తంగా #మీటూ ఉద్యమం ఊపందుకొంది. అది అన్ని రంగాలకు పాకింది. సినీ, రాజకీయ, కార్పోరేటు, క్రీడారంగం.. లోనూ లైంగిక ఆరోపణలు వస్తున్నాయి. వాటిలో కొన్నింటికి శిక్ష కూడా పడుతోంది. తనపై లైంగిక ఆరోపణలు రావడంతో కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఐతే, కొందరు #మీటూని మిస్ యూజ్ చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా ఇదే అంటున్నాడు.

టీమిండియా కూల్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని బయోపిక్ తో సుశాంత్ మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఇప్పుడీ కూల్ హీరోపై హీరోయిన్ సంజన లైంగిక ఆరోపణలు చేసింది. వీరిద్దరు కలిసి ‘కిజీ ఔర్ మ్యానీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. సెట్స్ లో సుశాంత్ సంజన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనే వార్తలొచ్చాయ్. తాజాగా, ఈ ఆరోపణలపై సుశాంత్ స్పందించారు. సెట్లో ఏం జరిగిందో వివరిస్తూ, సంజనకు తాను పంపిన మెసేజ్ ల స్క్రీన్ షాట్లను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

కొందరు కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారు. ఒకరి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం తప్పని తెలిసినా…తప్పడం లేదు. సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి రోజు వరకు సంజనతో జరిగిన సంభాషణ ఇదని తెలిపాడు మెసేజ్ ల స్క్రీన్ షాట్ల ట్విట్ చేశాడు. సుశాంత్ వర్షన్ ని చూస్తే మీటూ మిస్ యూజ్ అవుతుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మరీ.. దీనిపై సంజన ఎలా స్పందిస్తుందో చూడాలి.