అమృత్‌సర్‌ ఘటన : మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియో

అమృత్‌సర్‌ ఘోర రైల్ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 50కిపై మాటే. దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ దహనం చేస్తుండగా.. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. ఈ శబ్దాలకు రైల్వే ట్రాక్‌పై నిల్చున్నవారు అటువైపుగా రైలు వస్తున్న విషయాన్ని గుర్తించలేకపోయారు. దీంతో పెద్ద చోటుచేసుకుంది. మృతుల్లో చిన్నారులు కూడ ఉన్నారన్న విషయం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. ఈ ఘటన పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. రేపు ఘటన స్థలానికి వెళ్లనున్నట్టు తెలిపారు.